Saturday, March 27, 2010

నాక్కొన్ని డౌట్లు


చిన్నప్పుడు నేను, మా తమ్ముడు రాఘవేంద్ర స్వామి గుడి కి తరచు వెళుతూ ఉండేవాళ్ళం. అమ్మ మా తమ్ముడికి ఎప్పుడు చెప్పేది "తీర్ధం తీసుకున్నాక, కాళ్ళు మొత్తం జాపి సాష్టాంగం చెయ్యి. చేసేటప్పుడు కళ్ళజోడు తీసెయ్యి " అని. నేనైతే బుద్ధిగా సరే అనేదాన్ని. మరి నేను కదా, అందుకని. మా వాడు మాత్రం, "ఎందుకు? ఎవరు చెప్పారు తియ్యమని" అనేవాడు. మా అమ్మకి మండిపోయ్యి "చెప్పిన పని చెయ్యి. పిచ్చి ప్రశ్నలు నువ్వును. మొన్న ఎవరో టీవీ లో శంకరాచార్యుల వారు అలా చెప్పారని చెప్పారు" అంటే, "అసలు శంకరాచార్యులవారు BC టైం లో ఉండేవారు కదా? ఆ రోజుల్లో జనాలకి కళ్ళజోడు ఉండేదా?" అని వీడు మళ్ళి ఆర్గుమెంటు. మా అమ్మకి విసుగొచ్చి లోపలి వెళ్లి పొయ్యేది.
నిజానికి ఇలాంటివి పిచ్చి డౌట్లు కాదు. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ తక్కువవటం వాళ్ళ ఇలా జరుగుతుండచ్చు. ఇలాంటి డౌట్లు నాకు వస్తాయి కొన్ని సార్లు. ఇప్పుడు మాత్రం రెండింటిని గురించి వ్రాస్తాను. నాకు sincere గా వచ్చిన సందేహాలివి. మన పురాణాలని, culture ని కించపరచటానికి మాత్రం నేను ఇవి వ్రాయట్లేదు సుమా. అపార్ధం మాత్రం చేసుకోకండి.
వినాయక చవితి రోజు కధలో కృష్ణుడి నీలాప నిందల కధ ఉంటుంది. అందులో జాంబవంతుడు సమంతక మణి తన కూతురి ఉయ్యాల మీద కట్టటానికి తీసుకెల్తాడని ఉంటుంది. కృష్ణుడితో యుద్ధం అయ్యాక ఆ కూతురినే ఆయనకిచ్చి పెళ్లి చేసేసాడని ఉంటుంది. ఉయ్యాల లో పడుకునే పాపకి అప్పుడే పెళ్ళేంటి? లేకపోతే ఇది చెట్టుకు కట్టుకుని teenage అమ్మాయిలు ఊగే ఉయ్యాలా? అలా అయితే మణి ఎందుకు?
చందమామ లో చదివే కధల్లో చాల మటుకు చదివేవాళ్ళం ఎవరో ఒక ముని లేకపోతే రాజు వీర లెవెల్ లో తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వచ్చి disturb చేసేస్తాడు అని. వేరే వాళ్ళు తపస్సు చేస్తుంటే ఆయనికి ఎందుకంత ప్రాబ్లం? ఇదే మాట నేను మా ఫ్రెండ్ తో అంటే తనన్నాడు, "according to some schools of thought, ఇంద్రుడు అనేది ఒక పదవి లాంటిది, సో ఆ పదవి పోతుందేమో అని current ఇంద్రుడికి ప్రాబ్లం అయ్యుండచ్చు" అని.
పైన నేను చెప్పినట్లు, నాకు తెలియని పురాణాలు ఇక్కడ ఉండొచ్చు. సో మీకు తెలిస్తే నా సందేహాలు తీరుస్తారని ఆశిస్తున్నాను.
మనవి: దయచేసి మూఢ నమ్మకాలపై మీ అభిప్రాయాలని ఇక్కడ కామెంట్స్ లో వ్రాయవద్దని మనవి. అలాగే, ఇది నేను సరదాకి వ్రాసిన పోస్ట్. ఎవ్వరిని కించ పరచటానికి మాత్రం కాదు. మీకు నచ్చక పోతే, మన్నించమని మనవి అంతే కాని offensive కామెంట్స్ మాత్రం పెట్టకండి.